May 8, 2013
అందరి దృష్టీ బాబు పైనే
ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకావడంతో అందరి దృష్టీ ఆయనపైనే పడింది. ప్రధాని సహా జాతీయ నాయకులంతా చంద్రబాబును పలకరించారు. ములాయంసింగ్ యాదవ్, శరద్ యాదవ్, కమల్నాథ్, ఫరూక్ అబ్దుల్లా తదితరులంతా కార్యక్రమంలో ఉన్నంతసేపూ చంద్రబాబుతోనే ఉన్నారు. అనంతరం సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి పార్లమెంటు భవనంలోని టీడీపీపీ కార్యాలయానికి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వారిరువురూ చాలాసేపు చర్చించుకున్నారు. తర్వాత బయటకు రాగా బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ చంద్రబాబును పలకరించి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.
Posted by
arjun
at
2:18 AM