May 8, 2013
కలివిడిగా లక్ష్మీ పార్వతి
న్యూఢిల్లీ : ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో లక్ష్మీపార్వతి
చాలా చురుగ్గా వ్యవహరించారు. సరిగ్గా చంద్రబాబు, ములాయం తదితరులు విగ్రహం
వద్దకు వస్తుండగా ఆమె వారికంటే ముందు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు,
పురందేశ్వరి, బాలకృష్ణ సహా అందరినీ పేరుపేరునా పలకరించారు. స్పీకర్
విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో ప్రధానితో పాటు ముందు వరుసలో ఉన్న
చంద్రబాబు పక్కనే లక్ష్మీపార్వతి నిలబడ్డారు.
చంద్రబాబును అడిగి మరీ ఆయన చేతిలో ఉన్న గులాబి రేకుల్లో సగం తీసుకుని ఎన్టీఆర్ విగ్రహంపై వేశారు. తాను ఎన్టీఆర్ భార్యనని కొందరికి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబం మొత్తం మళ్లీ కలుసుకున్న సందర్భంగా అందరినీ పేరుపేరునా పలకరించానని, ఎవరూ తనను చూసి చిరాకు పడలేదని చెప్పారు. మీరాకుమార్ తనతో మాట్లాడారని, ఎవరినీ ఆహ్వానించలేదని చెప్పారన్నారు. తాను స్పీకర్కు క్షమాపణలు కూడా చెప్పానన్నారు.
చంద్రబాబును అడిగి మరీ ఆయన చేతిలో ఉన్న గులాబి రేకుల్లో సగం తీసుకుని ఎన్టీఆర్ విగ్రహంపై వేశారు. తాను ఎన్టీఆర్ భార్యనని కొందరికి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబం మొత్తం మళ్లీ కలుసుకున్న సందర్భంగా అందరినీ పేరుపేరునా పలకరించానని, ఎవరూ తనను చూసి చిరాకు పడలేదని చెప్పారు. మీరాకుమార్ తనతో మాట్లాడారని, ఎవరినీ ఆహ్వానించలేదని చెప్పారన్నారు. తాను స్పీకర్కు క్షమాపణలు కూడా చెప్పానన్నారు.
Posted by
arjun
at
2:24 AM