March 18, 2013
అధికారంలోకి వస్తే.. వ్యవసాయ రుణాల మాఫీ
సిర్పూర్(యూ) : తెలుగుదేశం పార్టీ
అధికారంలోకి వస్తే....టీడీపీ రైతుల వ్యవసాయ రుణాల మాఫీ చేస్తుందని టీడీపీ
పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. ఈ ఫైల్పైనే బాబు మొదటి
సంతకం పెడతారని అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండల
స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం అసాద్యమని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుందని, టీడీపీ
అధికారంలోకి రాగానే రుణాలను మాఫీ చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్ర భుత్వం పూర్తిగా విఫలం
అయిందన్నారు.
టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం, జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్రం భగవంత్రావు, కనక తుకారాంలు మాట్లాడారు.ప్రభుత్వ, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. అవినీతి ప్రభుత్వానికి బుద్ది చే ప్పే సమయం అసన్నమైందన్నారు. కా ర్యక్రమంలో రాజారాం,బోజ్జురావు, భ లిరాం, గణపత్నాయక్, షేక్ కలీల్, జంగు, భీంరావు, నాందేవ్, గుణవంత్రావు, కిషన్, హతిరాం, ఆత్రం ఓంప్రకాష్, అ ర్క నాగోరావు, మెస్రం శేకు, తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
5:48 AM