March 1, 2013

పాదయాత్ర హామీలు నెరవేరుస్తాం

'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర ముగింపు సందర్భంగా తమ అధినేత చంద్రబాబు ప్రకటించిన గుంటూరు డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీలన్నింటిని నెరవేరుస్తామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. గురువారం తెదేపా జిల్లా కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ జిల్లాలో 201 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన చంద్రబా బు 165 గ్రామాలు, నాలుగు మునిసిపాలిటీలు, గుంటూరు కార్పొరేషన్ పరిధి లో లక్షల మంది ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకొన్నారని చెప్పా రు. ఆ సమస్యలపై ఎక్కడికక్కడ స్పం దించి తాము అధికారంలోకి వస్తే ఏమి చేసేది స్పష్టంగా చెప్పారన్నారు.

22 రోజుల పాటు జరిగిన పాదయాత్రను విజయవం తం చేసిన జిల్లా ప్రజానీకానికి, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పు ల్లారావు కృతజ్ఞతలు తెలిపా రు. పాదయాత్రలో ఎక్కడికెళ్లినా రైతులు సాగునీటి సమస్యను ప్రస్తావించారని, దానిపై తాము ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. సా గర్, డెల్టా ఆయకట్టులో ఆరుతడి పం టలకు సాగునీరు విడుదల చేయించేవరకు పోరాడుతుమన్నారు. ప్రజాస్వా మ్య పద్ధతిలో జీడీసీసీ, డీసీఎంఎస్‌ల ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. టీడీపీకి స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నా కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేస్తూ గిమ్మికులకు పాల్పడుతోంది. మా పార్టీ సహకార అధ్యక్షులెవరూ వాళ్లకు లొంగరని పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ డెల్టా రైతులకు తక్షణం మరో తడికి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రూ.500 కోట్ల విలువైన మొక్కజొన్న, మినుము పంట ఎండిపోతుందన్నా రు. నూటికి 70 మంది కౌలురైతులు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించరాదన్నారు.

సహకార ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ నిజాయితీగా పాల్గొనాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గురజాల ఎమ్మెల్యే య రపతినేని శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, యాగంటి దుర్గారావు, నిమ్మకాయల రాజనారాయణ, మానుకొండ శివప్రసాద్, ఎస్ఎల్ వజీర్, చంద్రగిరి ఏడుకొండలు పాల్గొన్నారు.