February 3, 2013
వీళ్ల కష్టం ఊరికే పోదు!
విజయవాడలో అడుగుపెట్టగానే కష్టాల పుట్ట పగిలిందా అనిపించింది. వినతిపత్రాల
వెల్లువలో కొట్టుకుపోతున్నట్టనిపించింది. ఒక్కో వర్గానిది ఒక్కో సమస్య.
ఒక్కో బస్తీది ఒక్కో బాధల గాథ. అయినా ఈ నగరవాసులకు ఇంత నరకయాతనా?
పగబట్టినట్టు అభివృద్ధిని అడ్డుకుంటున్నారట! కుళాయి నుంచి రోడ్డు దాకా
ప్రతిదానికీ కొర్రీలేనట! కుటుంబం పనో, ఇంటి పనో, బంధువుల పనో చేసిపెట్టమంటే
తప్పుగానీ.. పేటను బాగు చేయాలని కోరడం నేరమెలా అవుతుంది? విజయవాడ ఫ్లైఓవర్
కోసం ఉద్యమించిన మా వాళ్లను అరెస్టు చేయడం ఎంత అన్యాయం! ఎవరిపైన వీళ్ల పగ?
ప్రగతి రథచక్రాలను అడ్డుకుంటే..
ఆ చక్రాల కింద పడి చావక తప్పదు! ఆటో మొబైల్ ఇండస్ట్రీ.. విజయవాడలో ప్రధాన ఉపాధి కేంద్రం.. దాదాపు రెండు లక్షల మంది ఆధారపడిన పరిశ్రమ. ఒక బస్తీ బస్తీయే ఆ పనిలో ఉంది. కానీ, వాళ్లకు పనులు చేసేవారే లేరు. కనీసం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం కూడా తమవద్ద లేదని ఆటో నగర్నుంచి వచ్చిన బృందం వాపోయింది.
వారంలో నాలుగు రోజులు కరెంటే ఉండటం లేదట. ఇలాగైతే వర్క్షాపులు ఎలా నడుపుకోవాలని ఆటో మొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు దీనంగా ప్రశ్నించారు. ఎలాంటి పరిశ్రమ ఎలాగయిపోయింది! స్వాతి థియేటర్ సెంటర్లో రోడ్డు పక్కన ఇద్దరమ్మాయిలు కనిపించారు. తోపుడు బండి పెట్టుకొని కిచిడీ అమ్ముతున్నారు.
దగ్గరకెళ్లి పలకరించాను. సమస్యలు ఆరా తీశాను. ఈ క్రమంలో వాళ్లు చెప్పినది విన్నప్పుడు ఏకకాలంలో గర్వమూ అంతులేని బాధా కలిగాయి. వారిలో ఒకరు ఎంబీఏ పూర్తి చేయగా, మరొకరు బీఎస్సీ చదువుతున్నారట. మంచి విద్యావంతులై కూడా స్వశక్తిని నమ్ముకోవడం ముచ్చటగొలిపింది. అయితే, చదువుకోవడం కోసం ఇంతలా కష్టపడుతున్నారని తెలిసి బాధపడ్డాను. వీళ్ల కష్టం ఊరికే పోదు. వీళ్లను ఇంత కష్టపెడుతున్న పాలకుల పాపమూ ఊరికే పోదు.
Posted by
arjun
at
6:08 AM