January 6, 2013
సంగెంలో బాబు యాత్ర విజయవంతం
చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర సంగెం మండలంలో విజయవంతమైంది.
బాబు యాత్రను విజయవంతం చేయడానికి తరలివచ్చిన పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, జనానికి
పరకాల నియోజక వర్గ ఇన్చార్జి చల్లా ధర్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా శుక్రవారం
ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు యాత్ర లో సంగెం పర్యటనకు ఎంతో ప్రాధా న్యం, విశిష్టత
ఉందని అన్నారు.
సంగెం మండలం చిరస్థాయిగా నిలిపోయే విధంగా టీడీపీ నేతలు పాద యాత్ర రూట్
మ్యాప్ రూపొందించినట్లు చెప్పారు. మండలంలోని పల్లార్గూడలో బాబు యాత్ర 1500 కిలో మీటర్లు
పూర్తి చేసుకున్న సందర్భంగా శిలా ఫలకం ఆవిష్కరించడంతో టీడీపీ చరిత్రలో సంగెం గుర్తుండి
పోతుందన్నారు. గురు, శుక్రవారాల్లో సంగెం మండలంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర సందర్భంగా
టీడీపీ కార్యకర్తలు, నేతలు చంద్రబాబు వెంట నడిచి యాత్రను విజయవంతం చేశారని చెప్పారు.
పాదయాత్రలో మండల, జిల్లా,రాష్ట్ర నాయకులు పాల్గొనడంతో పాటు కార్యకర్తల
శ్రమ మరిచి పోలేనిదని ధర్మారెడ్డి తెలిపారు.
గురువారం మండలంలోని మహారాజ్ తండా నుంచి ప్రారంభమై శుక్రవారం తీగరాజుపల్లిలో
ముగిసిందని చెప్పారు.
Posted by
arjun
at
4:59 AM