January 6, 2013

ఓపిక లేకుంటే ఎలా..?

 


పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ చల్లా ధర్మారెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ, పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్న బాబు ముందుగా జనగామ నియోజకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభంలో కల్పించుకున్న ధర్మారెడ్డి శుక్రవారంతో తన నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర ముగుస్తుందని ముందుగా పరకాల నియోజకవర్గ సమావేశం నిర్వహించాలని బాబు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆగ్రహించిన బాబు తాను పనిలేక పాదయాత్ర చేస్తున్నానా ఇన్‌చార్జ్‌లకే ఓపిక లేకుంటే ఎలా అని అసహనాన్ని వ్యక్తం చేశారు

ఎవరి నియోజకవర్గం వరకు వారు ఉండి తప్పుకోవడం సరికాదని పార్టీ కోసం ప్రజా సమస్యలపై వయస్సును, ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తుం టే ఇన్‌చార్జ్‌లు తప్పుకోవాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇన్‌చార్జ్‌లకే ఓపిక లేకుంటే కార్యకర్తల పరిస్థితి ఏమిటని పాదయాత్ర పూర్తయ్యే వరకు ఉండాల్సిన బాధ్యత లేదా అని జిల్లా నేతలందరిని దృష్టిలో పెట్టుకుని బా బు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నేతలంతా మి న్నకుండిపోయారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రబాబుతోపాటు రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కె.మధుసూదన్‌రెడ్డి, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు గాడిపల్లి ప్రేమలతారెడ్డి, ఉడుత రవియాదవ్, బొట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.