January 2, 2013
సారూ.. పెట్టుబడి కూడా రాలె..
దుగ్గొండి : 'అందినకాడల్లా అప్పు లు తెచ్చిన.. రెండెకరాల భూమిలో పత్తి పంటను
సాగు చేసిన.. నీలం తుఫాన్, అధిక వర్షాలతో పంట దెబ్బతిన్నది.. 12 క్వింటాళ్లు వస్తదనుకున్న..
పెట్టుబడి కూడా రాలె..' ఇదీ కేశపురం గ్రామానికి చెందిన కోరెడ్డి మల్లారెడ్డి నే రైతు
ఆవేదన.. పాదయాత్రలో చంద్రబాబుకు తన గోడు వినిపించాడు. అం దుకు స్పందించిన చంద్రబాబు,
కాం గ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. పంట లు దెబ్బతిని
నష్టపోయిన రైతు లను ఆదుకోలేదని, కష్టాల్లోకి నెట్టిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని
బాబు రైతులను కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమం కోసం ప్రాధ్యానతనిస్తామని
హామీనిచ్చారు. కాగా, ఇదే గ్రామంలోని లక్ష్మి అనే మహిళ కుమారుడైన చిన్నారిని ఎత్తుకొని
చంద్ర బాబు ముద్దాడారు.
పాదయాత్రలో పలకరింపులు..: లక్ష్మిపురం గ్రామానికి చెందిన రమే ష్ అనే వికలాంగుడు
తనకు ప్రభుత్వం నుంచి పింఛన్ అందడం లేదని చంద్రబాబుకు మొర పెట్టుకున్నాడు. విక లాంగుల
సంక్షేమాన్ని పట్టించుకోవాల ని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశా డు. ఇదే గ్రామంలో చంద్రబాబు
వృద్ద మహిళలను యోగక్షేమాలను అడిగి తె లుసుకున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన సకినాల
లక్ష్మయ్య కుటుంబా న్ని చంద్రబాబు పరామర్శించి, ఐదు వే ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.నాచినపల్లి
గ్రామంలో సాంబయ్యకు చెందిన లాండ్రీషాపు వద్దకు వెళ్లి ఆయన ను పలకరించారు. బాబు బట్టలను
ఇస్త్రీ చేశారు. లక్ష్మిపురం గ్రామంలో యువకుల కోలాటం వేడుకల మధ్యకు వెళ్లి కంజీర పట్టారు.
కోలాటం చేసేవారితో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి కోలాటాలను తాను చూడలేదన్నారు.
గీత కార్మికులు ఆయన వద్దకు రాగా మోకును వేసుకుని గీతా కార్మికులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Posted by
arjun
at
9:18 PM