January 2, 2013

అధికారం ఇవ్వండి.. సేవకుడిగా పనిచేస్తా



గ్రామీణ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని సేవకుడిగా పని చేసి అభివృద్ధి చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం కామారం గ్రా మ శివారులో బుధవారం ఉదయం 9.45 నిమిషాలకు లోకేష్ కుటుంబ సభ్యులు భువనేశ్వరి, కోడలు బ్రహ్మిణి తో గంటపాటు ముచ్చటించారు. అనంతరం చంద్రబాబు ఉదయం 11.10 ని మిషాలకు బాబు పాత్ర ప్రారంభమైం ది. బస స్థలం నుంచి 5 కిలోమీటర్ల వరకు పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ చల్లా ధర్మారెడ్డి అనుచరులు కన్నయ్య, తోట కుమారస్వామి స్వాగతం పలికారు.

కామారం గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేశా రు. అక్కడ నుంచి గ్రామ సమీపంలో ని పత్తి చేనులో పనులు చేస్తున్న కూలీలను వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. మళ్లీ అధికారం ఇస్తే మీ సే వకుడిగా, మీ కష్టసుఖాలు తీరుస్తానని వారికి భరోసా ఇచ్చారు. కామారం గ్రామ సమీపంలోని ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మగుడిని పరిశీలించారు. అక్కడ నుంచి పెంచికలపేట శివారుకు రాగానే అక్కడి కంది చేను ను పరిశీలించారు.నష్టపోయిన మహి ళా రైతులు ముదిగిరి మల్లమ్మ, మంగ అయిలమ్మ, గిద్దె ఎల్లమ్మ, రాజక్కలను పంట నష్టాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాం గ్రెస్, వైఎస్సార్ సీపీ నాయకులు దోచుకున్నారని మహిళలు చంద్రబాబుకు వివరించారు.

మహిళలు మంగళహారతులు, బో నాలతో ఘనస్వాగతం పలకగా పెంచికలపేటకు వెళ్లారు. హౌజింగ్ ఫెడరేష న్ మాజీ చైర్మన్ కడారి రఘునాథరా వు, మండల పార్టీ అధ్యక్షుడు ఎన్కతా ళ్ల రవీందర్, మాజీ జడ్పీటీసీ అంబటి రాజస్వామి, జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి పొలుసాని అనిల్‌రెడ్డి తదితరులు భారీ పూలమాలలతో చంద్రబాబును ఘనంగా సన్మానించారు. గీత కార్మికు లు చంద్రబాబుకు మోకు లొట్టిని బ హుకరించారు. పద్మశాలి కుల సంఘా ల వారు ఘనంగా సన్మానించారు. ఆత్మకూరు మండలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏమీ కనిపించడం లేదని అన్నారు. ఇందిర మ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నాయకులు దోపిడీ దొంగల్లా దోచుకున్నారని దుయ్యబట్టారు.

ఈ పాదయాత్రలో టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ చల్లా ధర్మారెడ్డి, హౌజింగ్ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ చైర్మ న్ కడారి రఘునాథరావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పూజారి సుదర్శన్‌గౌడ్, జిల్లా కా ర్యదర్శి జన్ను మల్లయ్య, మండల పా ర్టీ అధ్యక్ష కార్యదర్శులు ఎన్కతాళ్ల ర వీందర్, దుంపలపల్లి బుచ్చిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గండు రామకృష్ణగౌ డ్, అర్షం భిక్షపతి, నత్తిసాంబయ్య, ఎం డి.అంకూస్, బరుపట్ల కిరీటి, నేరేళ్ల క మలాకర్,గోల్కొండ శ్రీనివాస్ ఉన్నారు.