November 22, 2012
జగన్ ముందు చిత్రగుప్తుడు కూడా పనికి రాడు...
వైసీపీ అధినేత జగన్ ముందు చిత్రగుప్తుడు కూడా పనికి రాడని చంద్రబాబు విమర్శించారు. "వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు బెంగళూరులో ఉండే జగన్ ఇంత పెద్ద అవినీతికి పాల్పడ్డారు. 53 సెజ్లకు 8 వేల ఎకరాల భూములను అప్పనంగా ఇచ్చి కోట్ల రూపాయలను విదేశాలకు తరలించారు. తప్పుడు, గొలుసు కంపెనీల పేరిట అక్కడి నుంచి డబ్బులు తెచ్చిన జగన్ పెద్ద వ్యాపారిలా ఫోజు పెట్టారు. ఇలా లెక్కల తయారీలో చిత్రగుప్తుడిని మించిపోయారు'' అని మండిపడ్డారు.
అవినీతి డబ్బులతో పత్రిక పెట్టి మూడు పేజీలు వాళ్ల గురించి రాసుకుని, రెండు పేజీలు తమకు వ్యతిరేకంగా రాస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే మన ఇంటి పైకప్పులను కూడా లాక్కెళ్తారన్నారు. తీవ్రవాదులు, నక్సలైట్లకన్నా అవినీతే ప్రమాదమని చంద్రబాబు చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని, ఇందుకు మీరందరూ సహకరించాలని కోరారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment