November 22, 2012

ఎర్రన్నాయుడికి లోక్‌సభలో ఘనంగా నివాళి

ఎర్రన్నాయుడికి లోక్‌సభ నివాళి

న్యూఢిల్లీ, నవంబర్ 22 : కేంద్ర మా.జీ మంత్రి, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు కింజరపు ఎర్రన్నాయుడికి లోక్‌సభ నివాళి అర్పించింది. శీతాకాల సమావేశాల తొలిరోజు గురువారం సభ ప్రారంభం కాగానే తొలుత ఇద్దరు కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఎర్రన్నాయుడు, మరో తొమ్మిది మంది మా.జీ ఎంపీలతో పాటు శివసేనన అధినేత బాల్‌ఠాక్రే మృతికి స్పీకర్ మీరాకుమార్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా లోక్‌సభ కొద్దిసేపు మౌనం పాటించింది.


టీడీపీపీలో..
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎర్రన్నాయుడుకు ఆ పార్టీ ఎంపీలు ఘనంగా నివాళులర్పించారు. ఎర్రన్నాయుడు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నామా నాగేశ్వరరావు, కొనకళ్ల నారాయణరావు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప, రమేశ్ రాథోడ్, గుండు సుధారాణి, సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లతో పాటు కార్యాలయ కార్యదర్శి సత్యనారాయణ, సిబ్బంది నివాళులు అర్పించారు. ఎంపీగా, టీడీపీపీ నాయకుడిగా పార్లమెంటు లోపల, బయటా ఎర్రన్నాయుడు పార్టీ ప్రతిష్టను పెంచారని వారు కొనియాడారు.
No comments :

No comments :