November 22, 2012

కోట్లాది రూపాయల అవినీతిలో జగన్‌తో పాటు విజయలక్ష్మి,కుమార్తె షర్మిల,కోడలు భారతిలకు కూడా వాటాలు



ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దోచుకున్న కోట్లాది రూపాయల అవినీతిలో ఆయన కుమారుడు జగన్‌తో పాటు భార్య విజయలక్ష్మి,కుమార్తె షర్మిల,కోడలు భారతిలకు కూడా వాటాలున్నాయని టీడీపీ ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఆరోపించారు.కాబట్టి వారిని కూడా అరెస్టు చేసి జైల్లో  పెట్టాలని డిమాండు చేశారు.

తిరుపతిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ 2004లో ఎన్నికల సందర్భంగా జగన్ ఎన్ని ఆస్తులు చూపారో అందరికీ తెలుసని,ఈ మధ్యకాలంలోనే ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాధనాన్ని దోచిపెడితే విజయలక్ష్మి దాచిపెట్టిందని విమర్శించారు. వైకాపా సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటూ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని మండిపడ్డారు.రాష్ట్రంలో ఇంతకంటే సిగ్గుమాలిన పార్టీ మరొకటి లేదన్నారు.చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి విశ్వసనీయత అంటూ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

డబ్బు, కుర్చీ కోసమే ఈ తాపత్రయమన్నారు.వైకాపాకు ఏ మాత్రం దమ్ము,ధైౖర్యమున్నా వారి పార్టీకి చెందిన,మద్దతిస్తున్న 30 మంది ఎమ్మెల్యేల చేత అవిశ్వాస తీర్మానం పెట్టించడానికి సిద్ధం కావాలన్నారు. జగన్ బెయిల్ కోసం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్ కాళ్ళు పట్టుకుంటున్నారని ఆరోపించారు.

ఎన్‌టీ రామారావు మరణానికి లక్ష్మీపార్వతి తప్ప మరొకరు కారణం కాదన్నారు.ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ ఆయన్ను అవినీతి పరుడని ఆరోపించిన విషయాన్ని గుర్తు చేస్తూ అప్పుడు రామారావు విచారణకు కమిషన్ వేసుకుంటే కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా వైఎస్ ముందుకు రాలేదన్నారు.


No comments :

No comments :