September 7, 2013
సమైక్యవాదం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది : పయ్యావుల
ఎల్బీ స్టేడియం దగ్గర చూస్తే సమైక్యవాదం ఎంత
బలంగా ఉందో అర్థమవుతోందని టీడీపీ నేత పయ్యావుల కే శవ్ అన్నారు. శనివారం
మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం ఉద్యోగుల సభ మాత్రమే అని...సమైక్యం
కోరుకునేవారంతా తరలివస్తే హైదరాబాద్ సరిపోదని ఆయన తెలిపారు.
తెలంగాణలో 50 శాతం సమైక్యవాదులు ఉన్నారని...వారిని ఈ సభకు రానివ్వకుండా
చేసేందుకే తెలంగాణలో బంద్ ప్రకటించారని విమర్శించారు. టెన్జెన్పథ్
డైరెక్షన్లలోనే వైఎస్ విజయలక్ష్మి లేఖ రాశారని ఆరోపించారు. టీఆర్ఎస్
కారుకు డీజిల్, వైసీపీ ఫ్యాన్కు కరెంట్ను ఇస్తుంది కాంగ్రెస్సే అని ఆయన
అన్నారు. టీఆర్ఎస్, వైసీపీ నేతలు ఢిల్లీ పెద్దల చేతుల్లో కీలు బొమ్మలని
పయ్యావులు ఎద్దేవా చేశారు.
Posted by
arjun
at
7:52 AM