September 7, 2013
బాబుకు జేఏసీ నేతల అభినందనలు
జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర చేసిన టీడీపీ
అధినేత చంద్రబాబుకు జే ఏసీ నాయకులు అభినందనలు తెలిపారు. సమైక్య
ర్రాష్టాన్ని పరిరక్షించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం
జిల్లాలో యాత్ర ముగింపు సందర్భంగా జే ఏసీ నాయకులు ఎన్ శామ్యూల్, ప్రొఫెసర్
పిీ నరసింహారావు, ఎం వెంకట రమణ ప్రజా సంఘాల జే ఏసీ కన్వీనర్ సిరిపురపు
శ్రీధర్, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు కసుకుర్తి హనుమంతరావుతో పాటు
ఆర్టీసి, ఎల్రక్టిసిటి జే ఏసీ నాయకులు చంద్రబాబును కలిసి వినతి పత్రం
సమర్పించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జే ఏసీ నాయకులు శ్రీధర్
మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు సీమాంధ్ర ఉద్యమానికి సంఘీభావం
ప్రకటించటమే కాక తెలుగు జాతి విచ్ఛిన్నం కాకుండా అండగా ఉంటానని ప్రకటించటం
పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Posted by
arjun
at
7:58 PM