July 12, 2013

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మేయర్ చక్రవర్తి

రాజమండ్రి: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ ఎం. ఎస్.చక్రవర్తి తెలుగుదేశంపార్టీలో చేశా రు. హైదరాబాద్‌లో గురువారం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో చక్రవర్తి, నలుగురు మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచ్ ఒకరితోపాటు సుమారు 100మంది వివిధ స్థాయి నాయకులతో కలసి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. చక్రవర్తి బేషరత్‌గా పార్టీలో చేరినట్టు చెబుతున్నప్పటికీ కోనసీమలోని ఏదైనా ఒక ఎస్‌సి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ, విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పార్టీ అభ్యర్ధిగా నిలబడే అవకాశం ఉంది. నిజాయతీపరుడైన నాయకుడుగా పేరుగడించిన స్వర్గీయ బత్తిన సుబ్బారావు అల్లుడు అయిన చక్రవర్తి తెలుగుదేశం పార్టీలోచేరి, రాజమండ్రి మే యర్‌గా ఎన్నికైన సంగతి తెలిసిం దే. తర్వాత పరిణామాలలో ఆయన పిఆర్‌పిలో చేశారు.

ఆపార్టీ అట్టర్‌ప్లాప్ కావడంతో, కొంతకాలం క్రితం వైఎస్ఆర్ సిపిలో చేరారు. కానీ అక్కడ ఇమడలేకపోయిన చక్రవర్తి తిరిగి తెలుగుదేశంపార్టీలో చేరారు.దీని తో రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి అదనంగా కొంతబలం చేకూరినట్టు చెప్పవచ్చు. మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వయంగా చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లి, పార్టీ తీర్ధం ఇప్పించారు. ఆయన పార్టీలో చేరనున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సం గతి తెలిసిందే. పి.గన్నవరం లేదా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకచోట నుంచి ఆయనను పోటీ పెడతారనే ప్రచారం జరిగింది.కానీ కొ త్తగా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పేరు వినిపిస్తోంది. వాస్తవానికి చక్రవర్తిసొంత ఊరు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, ఆయన రాజకీయ తదితర కారణాల వల్ల అత్తవారి ఊరైన రాజమండ్రిలో స్ధిరపడ్డారు. ఆయన తండ్రి విశాఖలో సిటిఓగా పనిచేశారు. ఆయన సోదరులు ప్రస్తుతం డాక్టర్లునూ, వివిధ రంగాలలోనూ విశాఖలో ఉన్నారు. ఆయన సోదరి విజయనగరంలో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.

వివిధ కారణాల వల్ల ఆయన పాయకరావు పేట నుంచి పోటీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నట్టు సమాచారం. ఇంకా ఎన్నికలకు చాలా సమ యం ఉండడం వల్ల పరిణామాలు ఎలా మారతాయో ఇప్పుడే అంచనా వేయలేం. బేషరత్‌గానే చేరా: చక్రవర్తి తాను తెలుగుదేశం పార్టీలో బేషరత్‌గానే చేరానని, పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా పార్టీకి ఉపయోగపడేలా పనిచేస్తానని మాజీ మే యర్ ఎం.ఎస్.చక్రవర్తి తెలిపారు.గురువారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరిన ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.