July 12, 2013
నేర చరితులపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: బాబు
దోషూలుగా రుజువైన నాటి నుండే
ప్రజాప్రతినిధులను అనర్హులుగా చేయాలి
పేదరికానికి ప్రధాన అడ్డంకి అవినీతే
తెలంగాణపై చెప్పాల్సింది చెప్పాం
ఢిల్లీ అఖిలపక్షం, మహానాడు, పార్టీ ప్రాంతీయ సదస్సుల్లోనూ చెప్పాం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
నేర చరితులపై సుప్రీం కో ర్టు వెలువరించిన
తీర్పును తాము స్వాగతిస్తున్నామని టీడీ పీ అధినేత చంద్రబాబు నాయుడు
అన్నారు. దోషులుగా రుజువైన రోజు నాటినుండే ప్రజాప్రతినిధులను అనర్హులు గా
చేయాలని ఆయన పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన వారికి రక్షణలు ఇవ్వడాన్ని
సుప్రీం కోర్టు ప్రశ్నించడాన్ని అందరూ హర్షిస్తున్నారన్నారు. దోషులుగా
రుజువైన రోజు నే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంతటి వారిపై అయినా సరే అనర్హత వేటు
వేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. అవినీ తి రహిత సమాజం కోసం కోర్టులు కూడా
తమ వంతుగా కృషి చేస్తున్నాయని చంద్రబాబు నాయుడు అభినందిం చారు. గురువారం
ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసమర్ధ, అవినీతి పాలన వల్ల
దేశం నిర్వీర్యమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశా రు. రాజకీయాల్లో దోచుకుని
దాచుకునే వారు ఎక్కువ య్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి రహిత
సమాజం కోసం పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి సొమ్మును హవాలా
మార్గంలో విదేశాలకు తరలి స్తున్నారని చెప్పారు. అన్నా హజారే వంటి వారు
అవినీతి వ్యతిరేక పోరాటం చేశారని, విలువలతో కూడిన సమాజం కోసం కృషి
చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయప డ్డారు. కొంతమంది స్వార్థపరుల వల్ల
రాజకీయాలు కలుషి తమయ్యాయని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పేదరికానికి
ప్రధాన ఆడ్డంకి అవినీతేనని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం
అవినీతి విచ్చల విడిగా పెరిగి పోయిందన్నారు. నేరస్తులు, దోపిడీ దొంగలు
రాజకీయాల్లోకి రావడంతోనే విలువలు తగ్గిపోతున్నాయ న్నారు. కోర్టులు, కాగ్,
సీవీసీ, సీబీఐ లాంటి వ్యవస్థలు క్రి యాశీలకంగా పని చేస్తున్నాయని చంద్రబాబు
నాయుడు అభినందించారు. దురదృష్ణ వశాత్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వీటిని
నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతోంద న్నారు. రూ. 500, వెయ్యి నోట్లను
రద్దు చేయాలని తాము గతంలో చెప్పామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక
ల్యాండ్, శాండ్, లిక్కర్ ఇలా అన్నింటిలోనూ అవినీతి పెచ్చరిల్లుతోందని
చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా
ఉండాలన్నారు. మారిన పరిస్థితులకు ఆనుగుణంగా చట్టాలకు పదును పెట్టాలని,
అప్పుడు భారత్ ప్రపంచ అగ్రదేశాల సరసన నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు. నేర
చరిత్రను గుర్తు చేసుకుంటే.. పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదే శం
పార్టీకి కనీసం పోటీ చేసేందుకు కూడా ఎవ్వరూ ముం దుకు రాని పరిస్థితి
ఉందన్నారు. ఈ పరిస్థితి ఎందుకువ చ్చిందంటే అక్కడ జరిగినన్ని హత్యలు,
దోపిడీలు, నేరాలు నాకు తెలిసి రాష్ట్రంలో మరెక్కడా జరిగి ఉండక
పోవచ్చన్నారు.
రాజకీయాలకు రిటైర్మెంట్ అవసరం లేదు
కాగా,
రాజకీయాలకు రిటైర్మెంట్ వయస్సు అంటూ ఏదీ లేదన్నారు. అమెరికన్లు 75
సంవత్సరాలు వచ్చే వరకు రాజకీయాల్లో రాణిస్తునే ఉన్నారన్నారు. పని చేయడం ఒక
కల్చర్గా మారితే వయస్సుతో పనేం ఉటుందన్నా రు. అయితే, యువతకు కూడా
ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
అభివృద్ధిలో బీహార్ కంటే వెనుకే..
అభివృద్ది విషయంలో బీహార్ కంటే ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిపోయిందని
చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఎన్నో పనుల చేశామ
న్నారు. పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాలు ఇచ్చామని, ప్రజల వద్దకు పాలన
తీసుకు వెళ్లామన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అభివృద్ధి చేసిందేమీ
లేదన్నారు.
తెలంగాణపై ఇప్పటికే చెప్పాల్సింది చెప్పాం
తెలంగాణ
అంశంపై ఢిల్లీలో కోర్ కమిటీ భేటీ నేపథ్యం లో విలేకరులు చంద్రబాబుపై
ప్రశ్నల వర్షం కురిపించా రు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ప్రాంతాల వారీగా
మోహరిం చారు. మీరు ఏమైనా చెప్పదల్చుకున్నారా? అన్న ప్రశ్నకు బాబు సూటిగా
సమాధానం చెబుతూ తాము చెప్సాల్సింది చాలా స్పష్టంగా ఢిల్లీ అఖిలపక్షంలో
చెప్పాం, ఆ తర్వాత పా ర్టీ ప్రాంతీయ సదస్సులు, మహానాడులోనూ చెప్పాం. వా రు
ఏంచేస్తారో చూడాలిని చంద్రబాబు అన్నారు.
Posted by
arjun
at
7:48 AM