July 12, 2013

జనం గుండెల్లోకి దూసుకుపోతున్న బాబు..

చూస్తుంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుడి తిరిగిపోతున్నట్లే కనిపిస్తుంది. గతం కంటే కాస్త భిన్నంగా వ్యవహరిస్తూ.. అనవసర విషయాల జోలికి వెళ్లకుండా.. ప్రజాసమస్యలపై ఫోకస్ పెంచుతూ పరిస్థితికి తగ్గట్లు వాయువేగంతో స్పందిస్తూ.. ప్రజల గుండెల్లో సరికొత్త ఇమేజ్ ను ప్రింట్ చేసుకుంటున్నారు. ఇందులో మొదటిగా చెప్పాల్సి వస్తే.. ఉత్తరాఖండ్ ఎపిసోడ్. వరదల్లో చిక్కుకుపోయిన వారిని ఏ రాష్ట్రం వారు.. ఆ రాష్ట్రం వారు రక్షించుకొని పోవటం తప్పించి వేరే వాళ్లను పట్టించుకోలేని పరిస్థితి. ఇక.. తెలుగోళ్ల పరిస్థితి అయితే మహా ఘోరం. కిరణ్ సర్కారుకి ఉత్తరాఖండ్ బాధితులు అస్సలు పట్టలేదు. దీంతో అల్లాడిపోతున్న తెలుగువాళ్లకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ఆదుకొని.. వారి కష్టాలు విని.. సానుకూలంగా స్పందించి.… వారంతా ఇళ్లకు చేరటానికి వీలుగా ఫ్లెయిట్లు బుక్ చేసి మరీ క్షేమంగా ఇంటికి చేర్చారు. ఏదో ప్రచారం కోసం అన్నట్లు కాకుండా.. బాధితులను ఆదుకునేందుకు బాధ్యతతో వ్యవహరించటం... అధికారపక్షాన్ని సైతం ఆకట్టుకుంది. ప్రభుత్వం కూడా చేయలేని పనిని.. బాబు అధికారంలో లేకపోయినా నడిపించటమే కాకుండా.. తనకున్న పరిచయాలను పూర్తిగా ఇన్ వాల్వ్ చేసి.. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

ఇక.. రీసెంట్ గా సికింద్రాబాద్ లోని సిటీలైట్ హోటల్ కుప్పకూలిపోతే..సీఎం స్థాయి వ్యక్తి వచ్చి నాలుగు నిమిషాలు ఉండేందుకు నొప్పులు పడిపోతుంటే.. అందుకు భిన్నంగా చంద్రబాబు వ్యవహరించి బాధితులకు గుండెధైర్యం చెప్పి.. వారిని ఆదుకునేందుకు కొంత సమయం ఖర్చు చేయటం,బాధితుల్లో కొండంత భరోసాను నిలపటం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇక.. ఐఐటీల్లో రాష్ట్ర విద్యార్థులు చేరేందుకు కొత్త విధానం వేలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తును గండి కొడుతూ.. కేంద్రమంత్రి కపిల్ సిబల్ తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల తీవ్ర ప్రభావితం అయి దెబ్బ తినేది రాష్ట్ర విద్యార్థుల మీద. దీని గురించి కూడా బాబు స్పందించి.. ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టటమే కాదు.. విద్యార్థుల కెరీర్ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరూ స్థానిక రాజకీయాల్లోనూ. తెలంగాణ గురించి నిత్యం తలలు బద్దలు కొట్టుకుంటూ ప్రజలను పట్టించుకోకుండా ఉంటే.. బాబు మాత్రం ప్రజల కష్టాలను తీర్చేందుకు పెద్ద పీట వేస్తూ ముందుకు దూసుకెళుతున్నారు.