June 5, 2013

గెలుపే లక్ష్యంగా దూసుకుపోండి

గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమాన్ని విసృ్తతంగా నిర్వహించా లని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఇన్‌ఛార్జ్‌లదేనన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికలతో పాటు 2014 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమయ్యే వ్యూహంలో భాగంగా బుధవారం ఎన్టీఆర్ ట్ట్రస్ భవన్‌లో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమావేశాలను ఆయన ప్రారంభించారు. తొలుత ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్ స్థానాల నేతలతో సవిూక్ష నిర్వహించారు. భోజన విరామం తర్వాత మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్, నల్గొండ, భువనగిరి పార్లమెంటరీ స్థానాల నేతలతో చంద్రబాబు సవిూక్షించారు. ఈ ఎన్నికలు మనకు జీవన్మరణ సమసప్యని అన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, తెలగుదేశం పట్ల తిరగి అభిమానం పెంచుకుని ఓటేయడానికి సిద్దంగా ఉన్నారని ంటూ వారిని నేరుగా కలవడం వల్ల ప్రయోజనం పొందాల న్నారు. ప్రజలు అవినీతిని, ఆవ్రిత పక్షపాతాన్ని సహించరన్నారు. పాదయాత్రలో ప్రజలనుంచి సానుకూల స్పందన కనిపించిందన్నారు. టిడిపి హయాంలో జరిగిన అభివృద్దిని కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల నేతలు పాల్గొ న్నారు. విభేదాలు మరచి పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని బాబు సూచించారు.