June 13, 2013

మంత్రులదే వక్రబుద్ధి: చంద్రబాబు

శాసనసభలో ప్రతిపక్ష సభ్యులపై మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండి పడ్డారు. కుక్కతోక వంకర అంటూ సభలో మంత్రులు అంటున్నారని, కానీ వాళ్లదే వక్రబుద్ధి అని అన్నారు. ధరల పెరుగుదలపై గురువారం ఉదయం సభ ప్రారంభానికి ముందు గన్‌పార్కు వద్ద పార్టీ ఎమ్మెల్యేలలో కలిసి బాబు ధర్నా నిర్వహించారు. ధర్నాలో వంటా వార్పు కార్యక్షికమాన్ని చేపట్టారు. చంద్రబాబు మాట్లాడుతూ సర్కారు సభను నడిపించకపోవడంతో తాను బయట ఇలా మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం అర్ధరాత్రి కుటుంబసభ్యులతో అమెరికాకు వెళ్లారు. అమెరికాలో చదువుకుంటున్న కోడలు బ్రహ్మణి కశాశాల స్నాతకోత్సవ వేడుకల్లో పాలొనేందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ నెల 22న బాబు ఇండియాకు తిరిగిరానున్నారు.