June 12, 2013

అసెంబ్లీ ఏ ఒక్కరి సొత్తు కాదు: టీడీపీ

హైదరాబాద్: ప్రభుత్వం సమస్యల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, దీనికి అనుగుణంగా స్పీకర్‌ వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. అసెంబ్లీ ఏ ఒక్కరి సొత్తు కాదని అన్నారు. ప్రతిపక్షాలను అవమానపరిచే విధంగా మాట్లాడిన మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.