June 12, 2013

కాంగ్రెస్ నేతలతో కలయికపై బాబు ఆవేదన

కాంగ్రెస్ నేతలతో కలయికపై బాబు ఆవేదన కాంగ్రెసు పార్టీ నేతలతో మర్యాదపూర్వకంగా కలుస్తున్నప్పటికీ తనపై రాజకీయ విమర్శలు గుప్పించడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాంగ్రెసు నేతలతో మర్యాదపూర్వకంగా కలుస్తున్నప్పటికీ వాటిని రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారని పార్టీ నేతలతో అన్నారు.

కొందరు వాటికి వక్రభాష్యం చెబుతున్నారన్నారు. ఇకపై తాను ఎవరినీ కలువనని చెప్పారు. ప్రచారం కోసమే తనపై ఇలాంటి ఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రచారం కోసం ఇలా చేసే నేతలను అనుమతించరాదని బాబు పార్టీ నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి విమర్శలపై కాంగ్రెస్ నాన్ సీరియస్‌గా ఉందని కూడా చెప్పినట్లు తెలుస్తోంది.