June 12, 2013

బలిదానాలకు కేసీఆరే కారణం


హైదరాబాద్‌ : తెలంగాణ కోసం జరిగిన వెయ్యి బలిదానాలకు కేసీఆరే బాధ్యుడని టీడీపీ నేత మోత్కుపల్లి ఆరోపించారు. డబ్బున్నోళ్లకే టికెట్‌ ఇస్తానన్న కేసీఆర్‌ వైఖరిని ప్రజలు గమనించాలని చెప్పారు. టీజేఏసీ టీఆర్‌ఎస్‌కు తొత్తుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్‌, కోదండరాంలు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఛలో అసెంబ్లీకి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు