June 12, 2013

ఛలో అసెంబ్లీకి టీడీపీ సంపూర్ణ మద్దతు

హైదరాబాద్ : ఈ నెల 14న టీ జేఏసీ తలపెట్టబోయే ‘ఛలో అసెంబ్లీ’కి టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై టీడీపీ చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పారు. అయితే.. తాము జేఏసీ పిలుపు మేరకో, టీఆర్‌ఎస్ పిలుపు మేరకో ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడం లేదని, తెలంగాణ ప్రజలకోసమే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమౌతున్నామని మోత్కుపల్లి ప్రకటించడం కొసమెరుపు.