May 18, 2013

ఢిల్లీవీధుల్లో రాష్ట్ర పరువుతీస్తున్నారు:రేవంత్


హైదరాబాద్ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇద్దరూ ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర పరువు తీస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పిల్ల కాంగ్రెస్ పార్టీ టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని చెబుతోందని మండిపడ్డారు. వైసీపీ తప్పుడు వాదనలు, పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిందని గుర్తు చేశారు. ఆర్థిక నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోర్టు వ్యాఖ్యానించిందని తెలిపారు. సీబీఐవి చిలక పలుకులైతే వైసీపీ వారివి కాకి అరుపులు అని విమర్శించారు. కళంకిత మంత్రులపై కొత్తగా పోరాడుతున్నట్లు వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు.