March 30, 2013
టీడీపీ హయాంలో విద్యుత్తు నిర్వహణ భేష్
మాకు రుణమాఫీ
చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంఘం అధ్యక్షుడు ఏపీకే రెడ్డి
హైదరాబాద్ : విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ప్రభుత్వానికి
భజన మండలిగా మారిపోయిందని చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంఘం అధ్యక్షుడు ఏపీకే
రెడ్డి ధ్వజమెత్తారు. వినియోగదారుల అవసరాలను పట్టించుకోకుండా ట్రాన్స్కో,
డిస్కంలు ఏది చెబితే దానికి తలూపుతోందని దుయ్యబట్టారు. "టీడీపీ హయాంలో మేం
అసలు విద్యుత్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. ఆనాడు విద్యుత్
నిర్వహణ చాలా బాగుండేది.
ఇప్పుడు పరిశ్రమలకు కేటాయించిన విద్యుత్తు లోడులో 65 శాతానికి మించి వాడుకొంటే ఐదు నుంచి పది రెట్లు జరిమా నా విధిస్తామని హెచ్చరిస్తున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఖర్చు పెరిగిపోయి పొరుగు రాష్ట్రాల్లోని ఉత్పత్తిదారులతో పోటీ పడలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. " నష్టాల్లో కూరుకుపోయాం. రైతుల మాదిరిగా మాకూ రుణ మాఫీ పథకం ప్రకటించా లి. పరిశ్రమలకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి'' అని విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడు పరిశ్రమలకు కేటాయించిన విద్యుత్తు లోడులో 65 శాతానికి మించి వాడుకొంటే ఐదు నుంచి పది రెట్లు జరిమా నా విధిస్తామని హెచ్చరిస్తున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఖర్చు పెరిగిపోయి పొరుగు రాష్ట్రాల్లోని ఉత్పత్తిదారులతో పోటీ పడలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. " నష్టాల్లో కూరుకుపోయాం. రైతుల మాదిరిగా మాకూ రుణ మాఫీ పథకం ప్రకటించా లి. పరిశ్రమలకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి'' అని విజ్ఞప్తి చేశారు.
Posted by
arjun
at
12:10 AM