March 30, 2013

పేదల అభివృద్ధే ధ్యేయం

రాయదుర్గంటౌన్: పేదల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని నందమూ రి తారకరామరావు స్థాపించారని టీ డీపీ నాయకులు పేర్కొన్నారు. టీడీపీ 32 వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవా రం పట్టణంలోని పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కణేకల్లు రో డ్డు, లక్ష్మీబజార్, పాతబస్టాండ్, గాంధీ సర్కిల్, వినాయక సర్కిల్, బళ్లారిరోడ్డు మీదుగా శాంతినగర్‌లోని ఎన్టీఆర్ వి గ్రహం వరకు ద్విచక్రవాహనాల్లో ర్యా లీ నిర్వహించారు.

ప్రభుత్వాస్పత్రిలోని రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చే శారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఈ రామాంజినేయు లు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కో సమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాన్యుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేసి రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి తెచ్చేందుకు నాయకులు, కా ర్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చే యాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పసుపులేటి రాజు, పొరాళ్లు శ్రీనివాసులు, సంపత్ కు మా రి, వెంకటేశులు, పురుషోత్తమ్, వెంకటస్వామి నాయుడు పాల్గొన్నారు.

కణేకల్లులో : మండలంలో టీడీపీ 32 వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. హనకనహాళ్ గ్రా మంలో టీడీపీ నాయకుడు ఎస్‌కే మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ చి త్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర ప్రజలకు టీడీపీ పార్టీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం 2500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ రోగ్యం బాగుండాలని మారెమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు యోగీశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి, శేషప్ప, నాగార్జున, ప్రసాద్, వెంకటేశులు, బసిరెడ్డి, ఆదెప్ప పాల్గొన్నారు.

డీ హీరేహాళ్‌లో : తెలుగుదేశం పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని డీ హీరేహాళ్‌లో శుక్రవారం ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వేలాది మంది టీడీపీ కార్యకర్తలు మండల కేంద్రానికి తరలి వచ్చారు. ముందుగా డీ హీరేహాళ్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు చంద్ర, న ర సింహులు, దేవా, కల్యం తిప్పేస్వా మి, ఓబుళాపురం తిప్పేస్వామి, భూషన్, అలివేలు ప్రహళ్లాద తదితరు లు మాట్లాడారు. పేదప్రజల రక్తం నుంచి, శ్రామికుల ఆవేశంనుంచి, అ ణగారిన ప్రజల గుండెల్లోనుంచి టీడీపీ పుట్టుకొచ్చిందని టీడీపీ కార్యకర్తలు ఉద్వేగభరితంగా ప్రసంగించారు.