February 19, 2013
ప్రత్యేక ఆకర్షణగా ఫ్లెక్సీ
కూచిపూడిలో అమృతలూరుకు చెందిన శివా టెంపుల్ యూత్ ఆధ్యర్యంలో 150ఆడుగుల భారీ
ప్లెక్సీని ఏర్పాటుచేశారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా
ఏర్పాటుచేసిన ప్లెక్సీ పలువురిని ఆకట్టుకుంది. ఆంధ్రా హజారేగా చంద్రబాబును
అభివర్ణించారు. యువతకు దిశానిర్ధేశం చేశారు. ప్లెక్సీలో కాషాయధారి
ఎన్టీఆర్, చంద్రబాబు, బాలకృష్ణలపై చేయివేసిన పలు చిత్రాలు ఆకర్షణీయంగా
రూపొందించారు. దీనితోపాటు దమ్ముందా.. సిస్టంమార్చుకో.. ధైర్యం ఉందా..
అవినీతిని ఎదిరించు.. ఫైరుందా.. సమాజాన్ని మార్చు.. బాధ్యత ఉందా
చంద్రబాబుకు ఓటేయి అంటూ యువత, నేటి ప్రజానీకాన్ని ఉత్తేజపరిచే నినాదాలను
ఉదహరించారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు కూడా కొద్దిసేపు ప్లెక్సీ వద్ద
నిలబడి ఆసక్తిగా తిలకించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు, మాజీ
జడ్పీటీసీ శరణుగిరిని అడిగి ప్లెక్సీ ఏర్పాటు చేసిన వారి వివరాలు అడిగి
వారిని అభినందించారు. మూల్పూరు మార్గంలో కూడా అరటి బొత్తలతో మందిరాల్లో
ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటాలను తిలకించారు. ఆక్కడ చంద్రబాబుకు
శివాటెంపుల్ యూత్ సభ్యులు దిష్టి తీసి, గజమాలతో సత్కరించారు. అనంతరం
ఎన్టీఆర్ చిత్రపటాలకు కొబ్బరికాయ కొట్టారు. కార్యక్రమంలో శివా టెంపుల్
యూత్ సభ్యులు, యలవర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Posted by
arjun
at
12:00 AM