December 27, 2012
కొనసాగనున్న బాబు యాత్ర
టీడీపీ అధినేత చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించనున్నారు.
వచ్చే ఏడాది జనవరి 26 నాటికి యాత్రను ముగించాలని తొలుత నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అయితే, గురువారం కరీంనగర్లో పొలిట్బ్యూరో భేటీ సందర్భంగా మరికొంత కాలం యాత్ర కొనసాగిస్తానని,
మార్గం ఖరారు చేయాలని నేతలకు సూచించారు. కాగా, మార్చి నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు,
పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నాయి. దీంతో అప్పటివరకూ యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్
రూపొందనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Posted by
arjun
at
8:39 PM