December 27, 2012
ప్రజాదరణను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు..
బాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మంత్రి శ్రీధర్బాబు
జనాదరణ చూసి ఓర్వలేక అవాకులుచెవాకులు మాట్లాడుతున్నాడని టీ డీపీ జిల్లా అధ్యక్షుడు,
పెద్దపల్లి ఎమ్మె ల్యే విజయరమణారావు అన్నారు. మం డలంలోని గంగారం గ్రామంలో ఆయ న విలేకర్లతో
మాట్లాడుతూ చంద్రబాబుకు జిల్లాలో మహిళలు,రైతులు, యు వకులు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్నారన్నారు.
ప్రజాస్వామ్యంలో ధ ర్నాలు, నిరసన కార్యక్రమాలు, పార్టీ కా ర్యక్రమాలు చేసుకునే అధికారం
ఎవరికైనా ఉందన్నారు. టీడీపీ పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే కొందరు కర్రు నాగ య్య ఇంటిపై
దాడి చేస్తే పోలీసులు ఇం తవరకు కేసు పెట్టలేదన్నారు. దీనిపై త మ పార్టీ అధినేత చంద్రబాబు
పోలీసులను ప్రశ్నించడం తప్పా అన్నారు. మం త్రి శ్రీధర్బాబు కేవలం మంథనికే పరిమితమయ్యారన్నారు.
ఎస్సారెస్పీ ద్వా రా 6లక్షల ఆయకట్టు ఉంటే జిల్లాలో పంటలకు ఎన్ని మడులకు నీళ్లిస్తారో
చె ప్పాలన్నారు.
బాబు పాదయాత్రలో కాంగ్రెస్ తప్పులు తోడుతుంటే ఈ త ప్పులను కప్పి పుచ్చుకోవడానికే
లేనిపో ని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరెప ల్లి మోహన్కు చంద్రబాబు గురించి మాట్లాడే
అర్హత లేదన్నారు. ఒక దళితు డై ఉండి దళితులకు ప్రభుత్వం కరెంటు కట్ చేస్తే ఏనాడైనా
స్పందించారా అని ప్రశ్నించారు. ఆయన నియోజకవర్గం లో ఏ అధికారి రావాలన్నా డబ్బులు ఇ వ్వాల్సిందేనన్నారు.
కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఖరీఫ్ సీజన్లోనే 46 మంది రైతులు ఆత్మహత్యలు
చేసుకున్నారన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోపగాని సా రయ్యగౌడ్,
వంగళ తిరుపతిరెడ్డి, లంక సదయ్య, గొడుగు రాజకొమురయ్య, గాజరవేన సదయ్య, సుముఖం మల్లారెడ్డితోపాటు
తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
3:02 AM