December 7, 2012

మీకు అండగా ఉంటా..

(ముథోల్/భైంసా/ లోకేశ్వరం/కుంటాల)ముథోల్ నుంచి శుక్రవారం ప్రా రంభమైన బాబుపాదయాత్రలో ప్రజలు అడుగడుగనా తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సమస్యలను తీర్చడానికి నేను మీకు అండ గా ఉంటానని చంద్రబాబు నా యుడు పునర్ఘటించారు. ముథోల్ నుంచి ప్రారంభమైన యాత్రకు మొదట బీడీ కార్మికులు పెద్ద ఎ త్తున కలిసి సమస్యలను వివరించా రు. తమకు బీడీ చేయడం వల్ల ఆరోగ్యం క్షీణించడంతో పాటు త గింతన కూలీ లభించడం లేదని, ఫించన్ సైతం అందడం లేదన్నా రు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే డ్వాక్రా సంఘాలను నె లకొల్పి ర్వీలింగ్‌ఫండ్ ఇచ్చి మహిళలను ఎంతో అభివృద్ధి చేశామన్నారు.

వెయ్యి బీడీలకు రూ.150, కనీ సం పింఛన్ రూ.1500 అందిస్తామన్నారు. రహదారిలో పాదయాత్ర చేస్తున్న బాబుకు తాండూర్ మం డల వాసులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. మాజీ మండల అధ్యక్షులు బాశెట్టి రాజన్న ఆధ్వర్యంలో సమస్యల గురించి వివరించారు. సుద్దవాగు ద్వారా సాగు నీ రు, వర్షాధార భూములకు ప్రాణహిత చేవేళ్ల ద్వారా నీటిని అందించాలని, తానూర్‌లో జూనియర్ క ళాశాల ఏర్పాటు, పత్తి ధర క్వింటాలకు రూ.6వేలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ముథోల్ గురుకుల విద్యార్థులను కలిసి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి అమ్మనాన్న కళలను నెరవేర్చాలన్నారు.

తెలంగాణకు వ్యతిరేకం కాను..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ పార్టీ ఎన్నుడు వ్యతిరేకం కా దని చంద్రబాబు నాయకుడు అ న్నారు.

తరోడలో జరిగిన బహిరం గ సభలో ఆయన మాట్లాడారు. అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేస్తే తమ వైఖరిని వెల్లండించేందు కు సిద్ధంగా ఉన్నామన్నారు.టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రూ.25కోట్లతో ఉప ప్రణాళిక తయారు చేస్తామని, ఇస్లామిక్ బ్యాం క్ ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాల మాఫీకి తొలి సంతకం చే స్తామన్నారు. మార్గమధ్యంలో కు భీర్ మండలం గొడిసారకు చెందిన వెంకటి అనే అంధుడికి రూ.2వేలు, వాయిలింగికి చెందిన కిషన్ అనే వికలాంగునికి రూ. 2వేలు నగదును అందజేశారు.