December 7, 2012

వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర గురువారం ఉదయం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం

ఆదిలాబాద్ :టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర గురువారం ఉదయం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం అవుతుంది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఎంచ గ్రామం మీదుగా చం ద్రబాబునాయుడు పాదయాత్ర బుధవారం రాత్రి బాసరకు చేరుకుంది. చం ద్రబాబునాయుడు పాదయాత్రకు జి ల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో గురువా రం నుంచి ప్రారంభమయ్యే పాదయా త్ర ఈ నెల 13 వరకు కొనసాగుతుం ది. 8 రోజుల్లో మూడు నియోజకవర్గా ల మీదుగా 124 కిలోమీటర్లు చంద్రబాబునాయుడు పాదయాత్ర చేస్తారు.

ప్రతి రోజు 13 నుంచి 17 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించేలా ఏర్పాట్లు చే శారు. చంద్రబాబునాయుడు తన పా దయాత్ర సాగే ప్రాంతాల్లోని గ్రామాల్లోని ప్రజలను, చేన్లలో, పొలాల్లో పని చేసే రైతులను, కూలీలను పలకరి స్తూ వారి సమస్యలను తెలుసుకోనున్నారు. చంద్రబాబునాయుడు పాదయాత్ర సందర్భంగా బాసర, నిర్మల్, ఖానాపూర్‌లో బహిరంగ సభలను ని ర్వహించేందుకు టీడీపీ నేతలు ఏ ర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభల కు భారీ జన సమీకరణ చేయడంతోపా టు చంద్రబాబునాయుడు పాదయాత్ర లో ప్రతి రోజు 5 వేల మంది పా ల్గొనే లా జిల్లా నేతలు చర్యలు చేపడుతున్నారు.