December 7, 2012

బాబు యాత్ర ఏర్పాట్లపై ఎంపీయ సమీక్ష

భైంసా: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీ కోసం పేరిట జిల్లాలో గురువారం నుంచి నిర్వహించబోయే యాత్ర ఏ ర్పాట్ల పై బుధవారం ఎంపీ రాథోడ్ రమేష్ ఆ పార్టీ ప్రతినిధులతో సమీక్ష స మావేశం నిర్వహించారు. బుధవారం ఉదయం స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ ముథోల్ నియోజక వర్గ ఇన్‌చార్జీ నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శులు లోలం శ్యాంసుందర్, అబ్దుల్ కలాం, రాష్ట్ర ప్రతినిధి రమాదేవి, జిల్లా ప్రతినిధులు బోయిడి విఠల్, బాశెట్టి రాజన్న, వి మోహన్, ఎస్సీ సెల్ జిల్లా ప్రతినిధి దేవిదాస్‌తోపాటు పలువురితో కలిసి సమీక్షించారు. గురువారం ఉదయం బాసర నుంచి ప్రారంభమయ్యే యాత్ర ముథోల్ వరకు కొనసాగనుంది.

ఇం దులో బాగంగా మధ్యాహ్న భోజన స్థ లం, రాత్రి బస చేసే స్థలలు,ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. యాత్ర విజయవంతానికి చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. యాత్రలో పా ల్గొనే వారి, బస చేసే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ ప్రతినిధులు బాద్యతాయుతంగా వ్యవహరించి యాత్రను విజ యవంతం చేయాలని సూచించారు.