November 1, 2012
ఎర్రన్నాయుడు మరణానికి సంతాపం
ఎర్రన్నాయుడు మరణానికి సంతాపం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు(55) రోడ్డు ప్రమాదంలో మరణించడం విషాదకరం.ఆయన ప్రయాణిస్తున్న కారు పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి సమీపంలో గురువారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడడానికి విశ్వయత్నం చేసినా ఫలితం దక్కలేదు.ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, మరో ఇద్దరు గాయపడ్డారు. విశాఖపట్టణంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై శ్రీకాకుళంకు తిరిగొస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.. వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై మలుపుతిరుగుతున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొంది. ఎర్రన్నాయుడు మరణవార్త తెలుసుకుని ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఎర్నన్నాయుడు మరణానికి సంతాపం ప్రకటిస్తున్నాం.
Subscribe to:
Post Comments
(
Atom
)
2 comments :
So sad..We lost very good leader...perticularly TDP
yes..sir..
Post a Comment