November 1, 2012

పాదయాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం 01.11.2012

టిడిపి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బీర్కూర్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు కమ్మసత్యనారాయణ, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి బధ్యానాయక్‌లు మాట్లాడారు. బాబుపాదయాత్ర త్వరలో జిల్లాలో కొనసాగనుందన్నారు. తెలంగాణ కు టిడిపి అనుకూలంగా ఉందని టిడిపి యాత్రను అడ్డుకుంటే సహించేది లేదన్నారు. సింగూరు జలాలను ఆంధోల్‌ నియోజకవర్గానికి తరలించే జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్‌ జయప్రకాశ్‌, పోతురెడ్డి, వీరేశం, సత్యనారాయణ ,రశీద్‌ తదితరులు ఉన్నారు
No comments :

No comments :