November 1, 2012

కారాగారం వరకు వెళ్లి ఖచ్చితమైన హామీలు పొంది అమ్మ దగ్గరికి వచ్చి కండువా కప్పుకొంటున్నారు

కాంగ్రెస్ తె దే పా ల కార్యాలయాలకు టు లెట్ బోర్డు
అంటున్న వై ఎస్సార్ సి పి నాయకులు
తమ కార్యాలయం ప్రస్తుతం ఎక్కడ వుందో
తెలుసుకోలేక పోతున్నారు..
పాపం, పార్టీ నాయకుడితో పలు హామీలు పొంది
కప్పదాట్లు చేయడానికి
కార్యాలయం వున్న కారాగారం వరకు వెళ్లి
ఖచ్చితమైన హామీలు పొంది
అమ్మ దగ్గరికి వచ్చి కండువా కప్పుకొంటున్నారు
రేపు అధికారం లో కి వస్తే
జనాలు జైలు దగ్గరికి వెళ్లి
ములాఖత్ పొంది
సమస్యలు చెప్పుకొని
అమ్మ గారికి దండం పెట్టుకోవాలేమో
ప్రజా ప్రతినిధులు కూడా
అక్కడికే వెళ్ళే
అక్కడే అందుబాటులో వున్న
అధికారులకు
అక్కడే వున్న నాయకుడితో
ఆదేశాలు చేయించాలేమో
చిప్ప కూడు తింటున్న
సాటి ఖైదీలు ఆలోచనలతో
పథకాలు ప్రకటించి
ప్రజలకు అమలు చేయిస్తారేమో

సేకరణ:www.chaakirevu.wordpress.com
No comments :

No comments :