October 26, 2012

లోటస్ పాండ్, బెంగళూరులో ఆధునాతన భవంతులు ఎలా వచ్చాయో ప్రమాణం చేస్తారా ..

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డికి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి సవాల్ విసిరారు. ఆస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్ సెల్‌ఫోన్ వాడుతున్నట్లు మీ బిడ్డలపై ప్రమాణం చేసి చెప్తారా అని భారతి అడుగుతున్నారని, తన భర్త జగన్ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని తన బిడ్డలపై ఆమె ప్రమాణం చేసి చెప్పగలరా అని ఎదురు దాడి చేశారు.
జగన్‌కు చెందిన పలు కంపెనీలలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయో భారతి చెప్పాలని డిమాండ్ చేశారు. లోటస్ పాండ్, బెంగళూరులో ఆధునాతన భవంతులు ఎలా వచ్చాయో ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. జగన్ సోదరి షర్మిల ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రాన్ని నిలువునా దోచారని మండిపడ్డారు.
No comments :

No comments :