October 26, 2012
చంద్రబాబు యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ, 25వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం
సుదీర్ఘ పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత
చంద్రబాబునాయుడిని బావమరిది బాలకృష్ణ కలుసుకున్నారు. శుక్రవారం ఉదయం
జిల్లాలోని అమరవాయిలో బాబును కలిసి ఆయన యోగ క్షేమాలను అడిగి
తెలుసుకున్నారు. చంద్రబాబు పేరుపై అక్కడి లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో
ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, పాదయాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు. బాబుకు సంఘీబావం తెలియచేసేందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్లో పాదయాత్ర విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బాలయ్య తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, పాదయాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు. బాబుకు సంఘీబావం తెలియచేసేందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్లో పాదయాత్ర విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బాలయ్య తెలిపారు.
25వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర 25వ
రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం జిల్లాలోని అమరవాయి నుంచి చంద్రబాబు
పాదయాత్రను ప్రారంభించారు. ఈ రోజు 12 కిలోమీటర్ల మేర బాబు పాదయాత్రగా
వెళ్లనున్నారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment