October 26, 2012

నేడు బాబు వద్దకు బాలకృష్ణ

మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును శుక్రవారం ఆయన వియ్యంకుడు, సినీ నటుడు బాలకృష్ణ కలవనున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన చంద్రబాబు బస చేసిన మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చేరుకోనున్నట్లు సమాచారం. అయితే, పాదయాత్రలో ఆయన పాల్గొంటారా..? లేదా అన్నది నిర్థారణ కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

నేటి పాదయాత్ర ఇలా: చంద్రబాబు గురువారం రాత్రి వరకు 452 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. శుక్రవారం బూడిదపాడు, పెద్దపల్లి ద్వారా గద్వాల చేరుకుంటారు. గద్వాలలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
No comments :

No comments :