August 7, 2013

విభజన వల్ల సీమాంధ్ర ప్రజలకు నష్టం : ఎంపీ వేణుగోపాల్‌రెడ్డి

రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రజలకు నష్టపోతారని, తక్షణమే విభజన ప్రక్రియను ఆపాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముందు ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసనలు తెలిపామని అన్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం సభలో తెలుగుదేశం సభ్యులు నిమ్మల కిష్టప్ప, నారాయణరావు, వేణుగోపాల్‌రెడ్డి, శివప్రసాద్ పోడియం వద్దకు వచ్చి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభను స్తంభింప చేసిన విషయం తెలిసిందే