August 7, 2013
రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు : చంద్రబాబు
రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయి అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడుఅధికారంలోకి వచ్చినా స్వప్రయోజనాల కోసమే పని చేస్తుందని ఆయన ఆరోపించారు. నేతకార్మికుల అభివృద్ధిలో మార్పులేదని, టీడీపీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల జీవితాలు బాగుపడుతాయన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ప్రపంచ చేనేత దినోత్సవంలో చంద్రబాబుపాల్గొన్నారు. ప్రజలను ఎప్పుడూ సమస్యల సుడిగుండంలో నెట్టడం కాంగ్రెస్కు అలవాటని, ఆ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని, ప్రజాప్రయోజనాలు పట్టవని ఆయన అన్నారు. వర్షాకాలం రిజర్వాయర్లలో నిండా నీళ్లు ఉండి కూడాగ్రామాల్లో విద్యుత్ కోతలు విధించడం విడ్డూరమని ఆయన విమర్శించారు.
Posted by
arjun
at
7:59 AM