August 7, 2013
అవనిగడ్డలో ఉప ఎన్నిక అనివార్యం
జిల్లాలోని అవనిగడ్డలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
అక్కడ ఉప ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు తెలుగుదేశం పార్టీ
అధినేత చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినప్పటికీ పోటీ ఏర్పడింది. అన్ని
పార్టీలకు చంద్రబాబు లేఖ రాయడంతో కాంగ్రెస్, వైఎస్సార్సీపీతో సహ మిగిలిన
రాజకీయ పార్టీలు కూడా పోటీ విరమించుకున్నాయి. కొంత మంది ఇతరులు కూడా
విరమించుకోగా ఇద్దరు ఇండిపెండెంట్లు పోటీ చేయడంతో అవనిగడ్డలో ఎన్నిక
అనివార్యమైంది.
టీడీపీ శాసన సభ్యుడు అంబటి బ్రాహ్మనయ్య మృతి
చెందడంతో అవనిగడ్డలో ఉప ఎన్నిక జరగనుంది ఈనెల 21న పోలింగ్ జరగనుంది. టీడీపీ
తరఫున శ్రీహరి ప్రసాద్ పోటీ చేయగా మరో ఇద్దరు ఇండిపెండెంట్లు నిలబడ్డారు.
Posted by
arjun
at
7:58 AM