June 1, 2013

కేసీఆర్ దొంగ దీక్ష: ఎర్రబెల్లి


కేసీఆర్‌పై మరోసారి టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. ఓట్లు, సీట్లు కోసం తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. సైలైన్స్ ఎక్కించుకొని దొంగ దీక్ష చేసి , తెలంగాణ ప్రజలను నట్టేట ముంచుతున్నాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అమరవీరుల కుటుంబాలకు టిక్కెట్లు ఇచ్చేందుకు టిడిపి సిద్ధంగా ఉందని , దానికి టీఆర్‌ఎస్ అందుకే సిద్ధమేనా అని ప్రశ్నించారు. పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ నెలరోజుల్లో తెలంగాణ అని ఓట్లు దండుకొని, ఇప్పుడేమంటారని ఎర్రబెల్లి ప్రశ్నించారు.