June 1, 2013
కళంకిత మంత్రులపై చర్యలేవి?
భీమ్గల్: వైఎస్ హయాంలో ఆ యన తనయుడు జగన్ అవినీతిలో భాగం పంచుకున్న
ఆరుగురు కళంకిత మంత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. గురువారం
భీమ్గల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆరుగురు
మంత్రుల్లో ఇ ద్దరిని మాత్రమే తొలగించి, మిగితా న లుగురిని ఎందుకు
వెనకేసుకొని వస్తున్నారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అవినీతిపై టీడీపీ
అధినేత చంద్రబాబు మొదటినుంచి పోరాడుతూనే ఉన్నార ని ఈ సందర్భంగా
అన్నపూర్ణమ్మ గు ర్తు చేశారు. అక్రమాలకు పాల్పడుతు న్న వారికి కాంగ్రెస్
ప్రభుత్వం సహా య పడడం ఎంతవరకు సబబన్నారు. తెలంగాణ విషయంలో టీడీపీ స్పష్టత
ఇచ్చినప్పటికీ.. టీఆర్ఎస్ పదే పదే ఆ రోపణలు చేయడంపై ఎమ్మెల్యే ఆగ్ర హం
వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పా టు చేసే విషయంలో మొదటినుంచి మోసగిస్తున్న
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆమె ప్రజలకు
పిలుపునిచ్చారరు. రుణాల చెల్లిం పు విషయంలో ప్రభుత్వం, రైతులకు ఒత్తిడి
పెంచొద్దని ఆమె ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర బీసీ
సెల్ నాయకుడు రామాగౌడ్, మండల కన్వీనర్ గంగాధర్గౌడ్, మహిపాల్ పాల్గొన్నారు.
Posted by
arjun
at
11:31 PM