June 17, 2013

విద్యుత్ సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై టీడీపీ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. ఇవాళ ఉదయం వారు గన్‌పార్కు వద్ద ధర్నా చేపట్టి పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంక్షోభంపై జిల్లాల వారీగా చేపట్టిన కోటి సంతకాలను వారు ఈ సందర్భంగా ప్రదర్శించారు.