June 17, 2013
మంత్రుల వల్లే లక్ష కోట్లు: రేవంత్
కళంకిత మంత్రులను ముందుపెట్టి ప్రభుత్వం శిఖండిలా వ్యవహరిస్తోందని
తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆ మంత్రుల సంతకాల వల్లనే
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్
జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయలు సంపాదించారన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. తమ
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేసిన ఆరోపణలనే మంత్రి గీతా రెడ్డి చేశారన్నారు.
గీతా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలనుకుంటే తమకు ఏమాత్రం
అభ్యంతరం లేదన్నారు. అది తమకు సంబంధించిన విషయం కాదన్నారు. కాంగ్రెసు
ఎంపీలు పార్టీలు మారుతుంటే గీతా రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
Posted by
arjun
at
7:53 AM