March 14, 2013

ప్రజలసై భారం మోపుతున్న ప్రభుత్వాలు

ఇంకొల్లు రూరల్ : దీర్ఘకాలంగా గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని పర్చూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చా ర్జి ఏలూరి సాంబశివరావు అన్నారు.

మండల టీడీపీ సమావేశం బుధవా రం ఇంకొల్లులో పర్చూరు రోడ్డులోని ఒక ప్రైవేటు గోడౌన్‌లో గోరంట్ల జాన య్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతి థిగా పాల్గొన్న ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను మరచి,ధరలు విపరీతంగా పెంచి ప్రజ లపై భారం మోపాయని విమర్శించా రు. ధరల నియంత్రణపై పర్యవేక్షణ కూడా లేకుండా పోయిందన్నారు. పెట్రోలు, డీజిల్‌పై ఇప్పటికే పలుమా ర్లు ధరలు పెంచారని తెలిపారు. విద్యు త్ సర్‌చార్జిల పేరిట బిల్లులు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పని తీరు బేరీజు వేసుకుని ప్రజలు ఎన్నిక లలో తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లోని సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యప రచాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురికాకుండా ప్రతిఒక్క కార్యకర్త పార్టీ విజయం కోసం కృషిచే యాలని తెలిపారు. ఎన్టీఆర్ సుజల ధార పథకం ద్వారా గ్రామాలలో మిన రల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేయ టం జరుగుతుందన్నారు.

17వ తేదీ పెదగంజాం హైస్కూల్‌లో మెగా ఉచి త కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి చూపులో సమస్యలు ఉన్నవారు పేర్లను నమోదు చేయించు కోవాలని కోరారు. గ్రామాల్లోని నాయ కులు ఓటరు జాబితాలను పరిశీలించా లని తెలిపారు. సమావేశంలో బాచిన అమరారావు, సొసైటీ అధ్యక్షుడు పం గులూరి బాపారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కొల్లూరి నాయుడమ్మ, పేర్ని బాపారావు, వై.ప్రసాద్, షేక్ అన్సారీ, గుంజి వెంకట్రావు, లేళ్ల తిరుపతిరా యుడు, గ్రామాల నాయకులు, కార్య కర్తలు, ముస్లిం, మైనార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపు టీడీపీదే

యద్దనపూడి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకు నేందుకు కార్యకర్తలందరూ ఐక్యంగా కృషి చేయాలని పర్చూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఏలూరి సాంబశివరా వు పిలుపునిచ్చారు. బుధవారం యద్ద నపూడిలోని గోనుగుంట అప్పయ్య ఇంటి వద్ద మండల పార్టీ అధ్యక్షుడు రంగయ్యచౌదరి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రం లో విద్యుత్ సంక్షోభం వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నార న్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సర్ చార్జిల పేరుతో పేద ప్రజలపై అధిక భారం మోపుతుందని విమర్శించారు. మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని,సాగర్ కాల్వ ద్వారా చెరువుకు నీరు నింపి తాగునీటి సమ స్య లేకుండా ప్రజా ప్రతినిధులు, అధి కారులు చొరవ తీసుకోవాలన్నారు. ముందు గా గన్నవరంలో ముస్లిం పీర్ల చావిడిని పరిశీలించారు. ధూళిపాళ్ల రామస్వామి, కొల్లా సాంబశివరావుల ను పరామర్శించారు.

ఈ సమావేశం లో టీడీపీ నాయకులు కనపర్తి నాగేశ్వ రరావు, కోడె రామారావు, గోనుగుం ట్ల పెద్దబ్బాయి, నాగేశ్వరరావు, పెద్ద బాబు, పేరయ్య, కామేశ్వరరావు, ఈ దర రవి, రాము, కిరణ్, పోపూరి శ్రీను, ఆదినారాయణ పాల్గొన్నారు.