March 14, 2013

కేసీఆర్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తలొగ్గం : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ : కేసీఆర్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు భయపడేది లేదని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ నిజంగా ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశమే ఉంటే టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు రెండూ వేర్వేరుగా నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఢిల్లీలో కాళ్ల బేరాలు చేసేవారు తమను విమర్శిస్తారా అని ఆయన మండిపడ్డారు. ఎన్టీఆర్ ఆత్మఘోష గురించి మాట్లాడుతున్న టీఆర్ఎస్, 2004 లో కాంగ్రెస్‌తో ఎందుకు పొత్తు పెట్టుకుందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.