March 4, 2013

అనంతపురం జిల్లా నేతలతో బాబు సమావేశం

వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో అనంతపురం జిల్లా నేతలు సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, చమన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబు పాదయ్రాతపై సునీత ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యే స్థానాన్ని తమ జిల్లాకే ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు సమావేశం అనంతరం ఎమ్మెల్యే సునీత మీడియాతో తెలిపారు.