March 4, 2013
అనంతపురం జిల్లా నేతలతో బాబు సమావేశం
వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా కృష్ణా
జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో అనంతపురం జిల్లా
నేతలు సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, పయ్యావుల కేశవ్,
చమన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబు పాదయ్రాతపై సునీత ఆరా తీసినట్లు
తెలుస్తోంది. ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యే స్థానాన్ని తమ జిల్లాకే ఇవ్వాలని
చంద్రబాబును కోరినట్లు సమావేశం అనంతరం ఎమ్మెల్యే సునీత మీడియాతో తెలిపారు.
Posted by
arjun
at
4:19 AM