February 16, 2013

గవర్నర్ నరసింహన్‌ను కలిసిన టీడీపీ నేతలు

రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను తెలుగుదేశం పార్టీ నేతలు శనివారం రాజ్‌భవన్‌లో కలిశారు. కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు గవర్నర్ ను కోరారు.

నీరందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికే తీవ్ర నష్టం జరిగిందని, ఇకనైనా నీటిని విడుదల చేయాలని వారు కోరారు. గవర్నర్ ను కలిసినవారిలో టీడీపీ ఎమ్మెల్యేలు మహేందర్ రెడ్డి, కేఎస్ రత్నం, దాసరి బాలవర్దన రావు తదితరులు ఉన్నారు.