January 17, 2013
పల్లెల్లో బాబుకు ఘన స్వాగతం
నేలకొండపల్లి : తెదేపా అధినేత చంద్రబాబు
చేపట్టిన పాదయాత్ర బుధవారం నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహాపురంలోకి
ప్రవేశించింది. బాబుకు అప్పలనర్సింహాపురంలో ఘన స్వాగతం లభించింది.
అడుగడుగునా బాబుకు జనం పూల వర్షం కురిపించారు. పాదయాత్రలో ప్రజలు
పెద్దసంఖ్యలో పాల్గొనడంతో చంద్రబాబులో ఉత్సాహం పెల్లుబుకింది. తెలుగుయువత
కార్యకర్తలు బండారు వంశీ, బండారు శ్రీకాంత్, యలగల రా ంబాబు, శీలం
వెంకటనర్సయ్య, వంశీకృష్ణల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
రోజా, వెంకటేశ్వర్లు దంపతులు తమ పాపకు నాయకరణం చేయాలని బాబును కోరగా సరిత
అని పాపకు నామకరణం చేశారు. రాయగూడెం గ్రామ సరిహద్దులో మాజీ ఎంపీపీ తీగ
వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ నంబూరి సత్యనారాయణ, గ్రామ శాఖ
అధ్యక్షుడు వెన్నబోయిన లక్ష్మణ్రావు, నంబూరి నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో
బాబుకు ఘనస్వాగతం లభించింది. బాబు నడిచినంత సేపు పూలు చల్లుతూ
డప్పువాయిద్యాలతో జనం స్వాగతించారు. బుద్దారం గ్రామంలో ఆలెకట్ల
కొండల్రావు, గురునాధం, ఏ. రవి, నర్సింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు
ఘనస్వాగతం పలికారు. పైనంపల్లిలో నల్లాని మల్లికార్జునరావు, నల్లాని
వెంకటేశ్వర్లు, యడవెల్లి సైదులు, మేళ్లచెర్వు కృష్ణ, చిల్లంచర్ల నరేష్్,
గెల్లా జగన్మోహన్రావు ఆధ్వర్యంలో బాబుకు స్వాగతం పలికారు. బాబు వెంట ఎంపీ
నామ నాగేశ్వరరావు, ఖమ్మం - సత్తుపల్లి ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు,
సండ్ర వెంకటవీరయ్య, పాలేరు ఇన్ఛార్జి స్వర్ణకుమారి, గ్రామ నాయకులు బండారు
విశ్వనా ధం, బండారు రా ంబాబు, భూషఁయ, సత్యం, తీగ వెంకటేశ్వర్లు
తదితరులున్నారు. మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు నెల్లూరి భద్రయ్య,
మైసా శంకర్లు మండలంలో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
పసుపు మయమైన గ్రామాలు
చంద్రబాబు పాదయాత్రను పురస్కరించుకుని పాదయాత్ర సాగిన అప్పలనర్సింహాపురం, రాయగూడెం, బు ద్దారం, చెర్వుమాదరాం, పైనంపల్లి గ్రా మాలు పసుపుమయంగా మా రాయి. ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున పసుపుతోరణాలు కట్టారు. అదే సంఖ్యలో ఫ్లె క్సీలు ఏర్పాటు చేశారు. బాబు రాకతో ఆయా గ్రామాల్లో పండుగ వాతావర ణం కన్పించింది. బాబు యాత్రతో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో ఆత్మస్థైర్యం పెరిగింది. యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో దేశం శ్రేణులు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు.
Posted by
arjun
at
8:09 AM